1.ఉద్యోగానికి వాక్సిన్ కు లింకు పెట్టిన అమెరికా
అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వెటరన్ అఫైర్స్ విభాగంలోని ఉద్యోగులందరూ రాబోయే రెండు నెలల్లో గా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగాలను తొలగిస్తామన హెచ్చరించింది.
2.భారత భూభాగంలో చైనా గుడారాలు
తూర్పు లడక్ లో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది.దెం చోక్ వద్ద భారత భూభాగంలోకి చైనా పౌరులు గుడారాలతో తిష్ట వేశారు.
3.చైనాలో ఇసుక తుఫాన్.అస్తవ్యస్తం
ఇప్పటికే ఒకవైపు చైన్లు వర్షాలు ముంచెత్తి భారీగా ఆస్తి ప్రాణ నష్టం చోటు చేసుకోగా మరోవైపు ఇసుక తుఫానులు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి.చైనా లోని వాయువ్య భాగంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుఫాన్ డున్హు వాంగ్ నగరాన్ని ముంచెత్తింది.
4.పిఓకే లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ – బల్టిస్తాన్ లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ విజయం సాధించింది.
5.లిబియాలో పడవ ప్రమాదం.57 మంది మృతి
లిబియాలో వలసదారుల తో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోవడంతో ఆ ప్రమాదం 57 మంది పౌరులు మరణించారు.
6.అధ్యక్ష వేతనం వదులుకున్న పెరు అధ్యక్షుడు
పేరు అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్షవాది పెడ్రో క్యాస్టిలో తనకు రానున్న జీవితకాలపు వేతనాన్ని వదులుకున్నట్టు ప్రకటించారు.
7.అమెరికాలో భారతీయురాలి ప్రతిభ
యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మిషన్ కు డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన వీణా రెడ్డి నియమితులయ్యారు.ఈ మిషన్ కు తొలి ఇండో-అమెరికన్ డైరెక్టర్ గా వీణ చరిత్ర సృష్టించారు.
8.అమెరికా లో ఇసుక తుఫాన్… ఎనిమిది మంది మృతి
అమెరికాలోని ఉటా లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది తుఫాన్ కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో మిల్లర్డ్ కౌంటీ లోని ఇంటర్ స్టేట్ హైవే 15 పై 22 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.
9.ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ … ప్రవాసీయుల ప్రతిభ
పరమశివుడికి అద్భుతమైన గురుదక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు.ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమను ఏడు సాంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు.గురు పౌర్ణమి పురస్కరించుకుని సామవేదం షణ్ముఖ శర్మ రచించిన కీర్తనలకు అమెరికా రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శన నిర్వహించారు.
10.టోక్యో ఒలంపిక్స్ లో స్పెయిన్ పై భారత్ హాకీ జట్టు గెలుపు
టోక్యో ఒలంపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం 3-0 తేడాతో స్పెయిన్ పై మ్యాచ్ గెలిచింది.