1.ఇద్దరు భారత రచయితలకు గోల్డెన్ వీసా
యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో తాజాగా ఇద్దరు భారత రచయితలు చేరారు.దీబా సలీం ఇర్ఫాన్ , రాజు గుప్తాకు యూఏఈ ప్రభుత్వం పదేళ్ల గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
2.వేలం లో కోటి పలికిన మద్యం బాటిల్
ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ను వాషింగ్టన్ లో వేలం వేయగా 1,37,000 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.1,02,63,019 ) పలికింది.
3.అమెరికాలో ‘ మంకీపాక్స్ ‘
ఇప్పటికీ కోవిడ్ వైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొనగా, తాజాగా అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.టెక్సాస్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీ పాక్స్ వైరస్ కేసులు వెలుగు చూసింది.
4.స్పేస్ రైస్ పండిస్తున్న చైనా
ఎన్నో ప్రయోగాలకు నిర్ణయమైనా చైనా ఇప్పుడు రోదసి నుంచి తెచ్చిన విత్తనాలతో పంటలు పండించబోతోంది.దానికి ‘ రైస్ ఆఫ్ హెవెన్ ‘ లేదా ‘స్పేస్ రైస్ ‘ గా పేరు పెట్టింది.
5.కాలిఫోర్నియా సీరియల్ కిల్లర్ మరణశిక్ష
అమెరికాలో 2001లో ఇద్దరు మహిళలను కేసులో దోషిగా తేలిన మైకేల్ గార్గి లోకు లాస్ ఏంజిల్స్ లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
6.దక్షిణాఫ్రికాలో భారతీయులపై దాడులు .ఎలా ఎదుర్కుంటున్నారంటే
దక్షిణాఫ్రికాలో భారతీయులే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను స్థానిక ప్రభుత్వం కూడా అదుపు చేయలేక పోవడంతో భారతీయులే ఆయుధం పట్టి నిరసనకారులను ఎదుర్కొంటున్నారు.
7.న్యూయార్క్ లో ఓ వీధి భారతీయుడు పేరు
అమెరికాలో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది.న్యూయార్క్ నగరంలోని ఓ వీరికి భారత సంతతికి చెందిన పండిట్ రామ్ లాల్ పేరును న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ రిచ్ మండ్ హిల్ లో ఓ వీధి ఆయన పేరు పెట్టారు.
8.భారత జర్నలిస్ట్ మృతిపై తాలిబన్ల సంతాపం
ఆఫ్ఘానిస్థాన్లో ఆ దేశ బలగాలకు తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ కు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ పులిట్జర్ అవార్డు గ్రహీత దాని సిద్ధికి మృతిపట్ల తాలిబన్లు సంతాపం తెలిపారు.
9.సోషల్ మీడియా పై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం
కోవిడ్ పైన, వ్యాక్సిన్ ల పైన సోషల్ మీడియా తప్పుడు సమాచారం ఇస్తోందని, ప్రజలను ఈ మీడియా చంపేస్తోంది అని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మండిపడ్డారు.
10.పాకిస్తాన్ లో రెండు కుక్కలకు మరణశిక్ష
పాకిస్తాన్లో రెండు జర్మన్ షెఫర్డ్ కుక్కలకు మరణ శిక్ష విధించారు.
కరాచీలో ఓ లాయర్ పై దాడి చేయడమే దీనికి కారణం.