1.తానా వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ఈనెల 29న వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని 28,29 తేదీల్లో తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగుభాషా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తన తాజా అధ్యక్షుడు అంజయ్య చౌదరి ప్రకటించారు.
2 .అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు.బహిష్కరణ
అమెరికాలో ని ఒమాహాలో నివసించే ప్రదీప్ జెహాన్ సెల్వరాజ్ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రలోభ పెట్టిన వ్యవహారం పై అమెరికన్ న్యాయస్థానం అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.జైలు జీవితం పూర్తయిన తర్వాత అతడిని శాశ్వతంగా అమెరికా నుంచి బహిష్కరించనున్నారు .
3.పౌరులకు అమెరికా హెచ్చరిక
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న అమెరికన్ ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.వెంటనే ఎయిర్ పోర్ట్ గేటు వద్ద నుంచి వెళ్లిపోవాలని సూచించింది.
4. ఆప్ఘాన్ పై ముగిసిన అఖిల పక్ష సమావేశం
ఆఫ్ఘనిస్తాన్ లో చోటుచేసుకున్న పరిణామాలపై ఈరోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు క్షేమంగా తీసుకురావాలని, అక్కడ ఉన్న భారతీయులను పెట్టుబడులను సురక్షితంగా తీసుకు రావాలని ఆయన కోరారు.
5.హిందూ సిక్కులను అడ్డుకున్న తాలిబన్లు
అఫ్ఘాన్ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించిన హిందూ, సిక్కులు 140 మందిని తాలిబన్లు అడ్డుకున్నారు.
6.సరిహద్దుల్లో చైనా హడావుడి
భారత సరిహద్దుల్లో మరోసారి చైనా కవ్వింపు చర్యలకు దిగింది.
7.అమెరికాలో కాల్పులు .ముగ్గురు మృతి
అమెరికాలోని వాషింగ్టన్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగడం తో ముగ్గురు మృతి చెందారు.అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు.
8.కాబూల్ ఎయిర్ పోర్ట్ లో నీళ్ళు ప్రియం
కాబూల్ ఎయిర్ పోర్ట్ లో అన్ని వస్తువుల ధరలు అమాంతం విరిగిపోయాయి ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర 100 డాలర్లు అమ్ముతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
9.ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన కొనసాగినా, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దు అని ఐక్యరాజ్య సమితిలో భారత్ డిమాండ్ చేసింది.
10.దక్షిణాఫ్రికాలో భారతీయురాలి హత్య
పీపీఈ కిట్ల కుంభకోణాన్ని అధికారుల వద్ద బయటపెట్టింది అని హెల్త్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అధికారిగా ఉన్న భారత సంతతికి చెందిన బబియా డియోకరన్ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.