1.డెలివరీ బాయ్ గా మారిన ఆఫ్ఘన్ మంత్రి
ఆఫ్ఘన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకోవడం తో అక్కడి నుంచి ఆ దేశ అధ్యక్షుడు సహా ఎంతో మంది విదేశాలకు పారిపోయారు.ఆఫ్ఘన్ ఐటీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సా అధత్ అప్పటి అధ్యక్షుడితో పడకపోవడం తో తన పదవికి రాజీనామా చేసి జర్మనీకి పారిపోయారు.అయితే అప్పటి నుంచి దాచుకున్న సొమ్ములు ఖర్చుబెట్టుకుంటూ వస్తున్న ఆయన ఆ సొమ్ములు అయిపోవడం తో పిజ్జా డెలివరీ బాయ్ గా కొత్త జీవితం మొదలు పెట్టారు.
2.పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు
జమ్ము కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అవసరమైతే తాలిబన్ల సహాయం తీసుకుంటాము అంటూ పాక్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
3. ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారికి ఈ పాస్ తప్పనిసరి
ఆఫ్ఘానీయుల పాస్ పోర్ట్ గల్లంతు అయ్యింది అన్న వార్తల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆఫ్ఘన్ నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఈ పాస్ కావాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
4.భారత్ లో ఎప్పటికీ కరోనా
భారత్ లో ఎప్పటికీ కరోనా వ్యాధి ఉందిపోయేదే అని, వ్యాధి వివిధ దశల్లో కి మారుతుంది అని డబ్ల్యు హెచ్ వో స్పష్టం చేసింది.
5.అమెరికా బ్రిటన్ లకు తాలిబన్ల హెచ్చరిక
ఆగస్ట్ 31 లోగా అమెరికా , బ్రిటన్ దళాలు ఆఫ్ఘన్ విడిచి వెళ్లాలని, తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.
6.దుబాయ్ లో అతిపెద్ద వీల్
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ వీల్ ను ఏర్పాటు చేశారు.దీని పేరు ఐన్ దుబాయ్.
7.యూఏఈ వీసాల గడువు పొడిగింపు
యూఏఈ నుంచి సెలవుపై ఇంటికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన వారి ని దృష్టిలో పెట్టుకొని నవంబర్ 10 వరకు వీసాల గడువును పెంచారు.
8.ఆఫ్ఘన్ మహిళలు బయటకి రావొద్దు
ఆఫ్ఘన్ మహిళలు , ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దు అంటూ , వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.
9.జాంబియా అధ్యక్షుడిగా హిచిలేమా
జాంబియా కొత్త అధ్యక్షుడిగా హిచిలేమా 10 లక్షల మెజార్టీ తో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేశారు.
10.జర్మనీ ట్రైన్ డ్రైవర్స్ సమ్మె
జర్మనీలో ట్రైన్ డ్రైవర్స్ సమ్మె చేపట్టారు.జీతాలు, బోనస్ లు పెంచాలని ఈ సమ్మె బాట పట్టారు.