1.భారత విద్యార్థులకు శుభవార్త చెప్పిన బ్రిటన్
బ్రిటన్ లో చదువుకోవాలి అని ఆసక్తి ఉన్న భారత విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది.తమ విద్యాసంస్థల్లో చదువుకోవడం వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ ఫంక్షన్ ప్రతియేటా పెంచుతున్నట్లు గానే ఆ కోటాను 3200 కి పెంచింది.
2.అమెరికాలో ఎగరనున్న భారత పతాకం
భారత స్వతంత్ర దినోత్సవం 75 వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థ ఆగస్టు 15న న్యూయార్క్ లోని ఐకనిక్ టైమ్స్ స్క్వేర్ లో 25 అడుగుల ఎత్తు ఉన్న అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసింది.
3.అమెరికా అథ్లెట్ కామెరాన్ బురెల్ మృతి
అమెరికాకు చెందిన అథ్లెట్ కామెరాన్ బూరెల్ (26) ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచారు.ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
4.దుబాయ్ నివాసితులకు రెసిడెన్సీ వీసాల గడువు పెంపు
నివాసితులకు దుబాయ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది .కాలం చెల్లిన రెసిడెన్సీ వీసాల గడువును డిసెంబర్ 9 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
5.జనాలను ఇళ్ళల్లో పెట్టి తాళం వేస్తున్న అధికారులు
చైనాలో డెల్టా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.దీంతో జనాలు బయటకు రాకుండా ఇళ్లల్లో పెట్టి అధికారులు తాళం వేస్తున్నారు.
6.కరోనా కొత్త వాక్సిన్ లపై దబ్ల్యు హెచ్ వో సమీక్ష
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రస్తుతం వాక్సిన్ వేయించుకున్న వారికి ఈ వైరస్ సోకుతూ ఉండడంతో కొత్త వాక్సిన్ లపై దృష్టి పెట్టింది.
7.రష్యా సరస్సులో కూలిన హెలికాఫ్టర్
రష్యన్ గాడ్ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.ఓ సరస్సులో హెలికాఫ్టర్ కూలిన ఘటన లో ఏడుగురు గల్లంతయ్యారు.
8.భారత గిఫ్ట్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
ఆహ్వానిస్తూ నాన్ బహుమతి గా ఇచ్చిన యుద్ద హేలికాఫ్టర్ లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
9.పిలిఫిన్స్ లో భారీ భూకంపం .సునామీ భయం
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది రిక్టార్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు అయ్యింది.దీంతో సునామీ భయం ప్రజల్లో నెలకొంది.
10.స్కూళ్ళు తెరవాల్సిందే .డబ్ల్యూహెచ్వో
స్కూళ్లను ఇక తెరవాల్సిందేనని, లేదంటే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.