1.పది కోట్ల మరణాలు అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కరోనా విజృంభించిన సమయంలో తమ ప్రభుత్వం అలెర్ట్ అయ్యిందని , యుద్ధ ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు ఆర్డర్ ఇవ్వడంతోనే ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని, లేకపోతే 10 కోట్ల మరణాలు సంభవించేవని ట్రంప్ వ్యాఖ్యానించారు.
2.అబుధాబి లో భారతీయుడి అరెస్ట్
యూఏఈ లో ప్రమాదవశాత్తు ప్రవాస భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళకు చెందిన 30 ఏళ్ల రషీద్ మసూద్ అబుదాబీ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ముస్సాఫ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉంటున్నాడు.శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఉంటున్న బిల్డింగులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
3.భారత్ ప్రయాణికులపై ఆంక్షలు తొలగింపు
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు విధించిన ఆంక్షలను బ్రిటన్ ప్రభుత్వం సడలించింది.రెడ్ జాబితానుంచి యాంబర్ జాబితాలోకి చేర్చింది.
4.అమెరికాలో కొవిడ్ ఉదృతి
అమెరికాలో కొవిడ్ ఉదృతి కొనసాగుతోంది.దాదాపు రోజుకు లక్ష కేసులు నమోదవుతున్నాయి.
5.వీసా ల జారీపై బైడన్ కు సేనెటర్ల బృందం లేఖ
అంతర్జాతీయ విద్యార్థులకు వీసా జారీ అంశంపై ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది.
6.అందుబాటులో పీసీఆర్ టెస్ట్ సెంటర్
భారత ప్రయాణికులకు యూఏఈ ప్రభుత్వ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది.
7.గ్రీస్ లో కూలిన విమానం
గ్రీస్ లో రాజుకున్న కార్చిచ్చు ను అదుపు చేస్తున్న క్రమంలో ఓ విమానం కుప్ప కూలింది.
8.పాక్ కు అందని ఆహ్వానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
9.నాసా సరికొత్త ప్రకటన
కృత్రిమ వాతావరణంలో నివసించేందుకు గాను ఔట్చాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
10.బ్యాంకాక్ లో భారీ నిరసనలు
థాయిలాండ్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంతో పాటు, ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం విఫలమైందని వేలాదిమంది ఆందోళనకారులు నిరసనలు నిర్వహిస్తున్నారు.