1.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ నెల 13,20 వ తేదీల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది.
2.వచ్చే మూడేళ్ళలో 220 విమానాశ్రయాలు
రాబోయే మూడేళ్లలో దేశంలో కొత్త గా 220 విమానాశ్రయాలను నిర్మించాలనే లక్ష్యం గా పెట్టుకున్నట్టు కేంద్ర విమానయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
3.మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తర కొరియా
ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ ను ఉత్తర కొరియా ప్రయోగించింది.
4.పుతిన్ పై నాటో విమర్శలు
రష్యా ప్రధాని పుతిన్ పై నాటో విమర్శలు చేసింది.స్వాతంత్ర సాధికార దేశం పై యుద్ధాన్ని చేపట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోలుకోలేని తప్పు చేశాడని నాటో విమర్శించింది.
5.ఆఫ్ఘన్ నేతలతో చైనా విదేశాంగ శాఖ మంత్రి భేటీ
ఆఫ్గన్ నేతలతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ భేటీ అయ్యారు.ఆర్థిక , రాజకీయ అంశాలపై చర్చించారు.
6.బ్రస్సెల్స్ లో నాటో దేశాల అత్యవసర భేటీ
బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్ లో నాటో దేశాలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి.ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
7.మాస్క్ నిబంధన ను ఎత్తివేసిన పోలాండ్
కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మాస్క్ నిబంధనలు ఎత్తివేస్తూ పోలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
8.రష్యా ఉక్రెయిన్ వార్ .15 వేల మంది మృతి
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం లో దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు మరణించినట్టు నాటో ప్రకటించింది.
9.పాక్ ప్రధాని ఇమ్రాన్ కు జరిమానా
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ ఎలక్షన్ కమీషన్ జరిమానా విధించింది.ఇటీవల స్వాత్ లో జరిగిన బహిరంగ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను 50 వేల జరిమానా విధించారు.
10.ఉక్రెయిన్ లోని భారతీయుల సంఖ్య పై క్లారిటీ
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు తరలించిన భారతీయుల తో పాటు, ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు అనే విషయంపై స్పష్టత ఇచ్చింది.మొత్తం ఉక్రెయిన్ నుంచి 22,500 మందిని తరలించినట్టు చెప్పారు.ఇంకా అక్కడ 50 మంది విద్యార్థులు ఉక్రెయిన్ లోనే ఉన్నట్టు ప్రకటించింది.