1.టూరిస్ట్ వీసాల పై సస్పెన్షన్ ఎత్తివేత
కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ టూరిస్ట్ వీసాల తో సహా, సాధారణ పేపర్ వీసాల ను భారత్ పునరుద్ధరించింది.
2.యూఏఈ లో జస్టిస్ ఎన్వీ రమణ కు ఘన స్వాగతం
యూ ఏఈ లో జస్టిస్ ఎన్వీ రమణ కు ఘన స్వాగతం లభించింది.ఓ అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగించేందుకు వెళ్ళిన జస్టిస్ రమణ కు విమానాశ్రయంలో ప్రవాసులు ఘనస్వాగతం పలికారు.
3.హత్య కేసులో నిందితుడు గా ఉన్న తెలుగు వ్యక్తి ఆత్మహత్య
కువైట్ లో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యి జైలులో ఏపీకి చెందిన వెంకటేశ్ (35) అనే వ్యక్తి జైలులో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
4.ఉక్రెయిన్ కోసం అమెరికా నుంచి డ్రోన్ ఆయుధాలు
రష్యా బలగాలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.వీటిలో 100 సాయుధ డ్రోన్ లను చేర్చారు.
5.దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం
దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.ఒక్క రోజులోనే 6 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.
6.రష్యా కు వ్యతిరేకంగా భారత జడ్జి ఓటు
రష్యా కు వ్యతిరేకంగా భారత జడ్జి ఓటు వేశారు.ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దాన్ని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం లో జరిగిన ఓటింగ్ లో భారత జడ్జి జస్టిస్ దల్వీర్ భండారి ఓటు వేశారు.
7.ఇజ్రాయిల్ లో కొత్త కరోనా వేరియెంట్
ఇజ్రాయిల్ లో కొత్త కరోనా వేరియెంట్ బయట పడింది.వాటికి BA 1, BA2 అనే పేర్లు పెట్టారు.
8.మిస్ వరల్డ్ 2021 కిరీటం పోలాండ్ యువతి సొంతం
ప్యుర్థోరికా లో జరిగిన 70 వ ప్రపంచ సుందరి పోటీల్లోమిస్ వరల్డ్ ,2021 కిరీటాన్ని పోలాండ్ కు చెందిన కరోలినా బిలవాస్క్స్ గెలుచుకున్నారు.ఈ పోటీలు గత ఏడాది డిసెంబర్ లో జరగాల్సి ఉన్నా, కరోనా కారణంగా దానిని అప్పుడు వాయిదా వేశారు.
9.ముషారఫ్ ను కలిసిన సంజయ్ దత్
బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ పాక్ మాజీ ప్రధాని సంజయ్ దత్ తో భేటీ అయ్యారు.దుబాయ్ లో వీరి భేటీ జరిగింది.
.