1.హైతీకి తదుపరి రాయబారిగా రాము అబ్బగాని
హైతి దేశానికి తదుపరి భారత రాయబారిగా రాము అబ్బ గాని ని నియమించారు.
2.ఘనంగా జరిగిన ఆటా మహాసభలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అమెరికన్ రాజధాని వాషింగ్టన్ డీసీ లో ఆటా మహాసభలు ఘనంగా జరిగాయి.
3.కువైట్ లోని భారత ఎంబసీ ఓపెన్ హౌస్ మీటింగ్
కువైట్ లోని భారత ఎంబసి ఓపెన్ హౌస్ మీటింగ్ నిర్వహించింది.కువైట్ లోని భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత రాయబారి సీబి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు.
4.లండన్ లో ఘనంగా టాక్ బోనాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ బోనాలు ఘనంగా నిర్వహించారు.
5.తుపాకీతో కాల్చుకుని భారత పౌరుడు మృతి
నేపాల్ లోని ఇండియన్ ఎంబసి కార్యాలయం వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న భారత పౌరుడు ఉత్తరాఖండ్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
6.చైనాకు భారత్ రిక్వెస్ట్
కరోనా కారణంగా చైనాలో విద్యను అభ్యసిస్తూ మధ్యలోనే వచ్చేసిన భారత విద్యార్థులను తిరిగి చైనాకు అనుమతించాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగి యితో బాలిలో సమావేశం అయ్యారు. 7.బ్రిటన్ ప్రధాని సంచలన నిర్ణయం బ్రిటన్ ప్రధాని బోరిక్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.జాన్సన్ పై నమ్మకం కోల్పోయామంటూ 40 మంది మంత్రులు రాజీనామా చేయడం తో జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
8.ఇండియా లో కొత్త ఒమిక్రాన్ వేరియెంట్ గుర్తింపు
ఇండియాలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ 2.75 గా పిలిచే ఈ వేరియంట్ విజృంభిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ హెబ్రేసెస్ వెల్లడించారు.
9.వివో పై ఈడి సోదాల పై చైనా ఆగ్రహం
చైనా మొబైల్ తయారీ సంస్థ వివో, దాని అనుబంధ సంస్థ లపై భారత్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగడం పై భారత్ అధికారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
.