1.వాషింగ్టన్ లో తెలుగు సాహితీ సదస్సు
తెలుగు రంగస్థలం సాహితీ సదస్సు వాషింగ్టన్ డిసి లో జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రవాస ఆంధ్రులు భాను మాగులురి అధ్యక్షత వహించారు.
2.అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్
అమెరికాలో నీల్ చంద్రన్ అనే భారత సంతతి వ్యక్తి 300 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డాడు.రెండు కేసుల్లో నేరం నిరూపణ కావడంతో ఒక్కొక్కరికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ యూఎస్ కోర్టు తీర్పు ఇచ్చింది.
3.ఐరోపా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ఐరోపా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది.రాబోయే వేసవి లో ఐరోపా దేశాల్లో ఊహించని స్థాయిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతాయని హెచ్చరించింది.
4.రష్యా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన మోదీ
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు.భారత్ రష్య సంబంధాలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
5.పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ సంక్షోభం
పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దేశవ్యాప్తంగా గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమలు చేస్తూ ఉండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
6.ఇజ్రాయిల్ కొత్త ప్రధాని గా యార్ లాపిడ్
ఇజ్రాయిల్ 14 వ ప్రధాని గా యార్ లాపిడ్ బాధ్యతలు స్వీకరించారు.
7.కరోనా కేసుల్లో 18 శాతం పెరుగుదల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో 18 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
8.ఉక్రెయిన్ లో అపార్ట్మెంట్ పై రష్యా క్షిపణి దాడి
ఉక్రెయిన్ లో ఓ అపార్ట్మెంట్ పై రష్యా క్షిపణి దాడి చేసింది.ఈ ఘటనలో 18 మంది పౌరులు మరణించారు.