1.అమెరికా పారిపోతున్న ఎన్.ఆర్.ఐ అరెస్ట్
భర్తను కోల్పోయి వృద్దాప్యంలో ఒంటరిగా ఉన్న తల్లిని వదిలేసి అమెరికా వెళ్తున్న చెన్నై కు చెందిన రామకృష్ణన్ అనే వ్యక్తిని ఆయన తల్లి దూర్గంభాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.
2.సెయింట్ లూయిస్ లో టిడిపి ఆత్మీయ సమావేశం
సెయింట్ లూయిస్ లో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు.
3.యూకే వీసాలు భారతీయులకే అధికం
వీసాల మంజూరు లో యూకే భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.గత జూన్ నాటికి సంవత్సర కాలంలో 1,18000 మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా పంపారు.
4.తరుచూ దుబాయ్ వెళ్ళే భారతీయులకు శుభవార్త
తరచుగా దుబాయ్ వెళ్లే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్లు యూఏఈ ప్రకటించింది.
5.భారీ వర్షాలతో పాక్ అతలాకుతలం
భారీ వర్షాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది.వరదల కారణంగా ఇప్పటి వరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు.
6.బాలికల విదేశీ విద్య పై ఆఫ్ఘన్ నిషేదం
ఆఫ్ఘనిస్తాన్ లో బాలికల విదేశీ విద్యపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
7.అమెరికా సెనేటర్ తైవాన్ టూర్ … చైనా వార్నింగ్
అమెరికా సెనైట్ స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా పర్యటనలను కొనసాగిస్తోంది అమెరికా.
8.భూమికంటే లోతైన గ్రహాన్ని కనుగొన్న నాసా
భూమిపై ఉన్న సముద్రలకంటే లోతుగా ఉన్న ఒక ఎక్సో ప్లానెట్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ గ్రహాన్ని TOL -1452 b గా పిలుస్తున్నారు.
9.రెండు వేల లోన్ యాప్స్ ను తొలగించిన గూగుల్
దాదాపు రెండు వేల లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.