1.న్యూ జెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ లో భారతీయ అమెరికన్ కు చోటు
అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి దక్కింది.న్యూ జెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ వైద్యురాలు నిమిషా శుక్లా ఎంపికయ్యారు.
2.భారతీయ డ్రైవర్ కు దుబాయ్ పోలీసుల సన్మానం
దుబాయ్ లో భారతీయ డ్రైవర్ అబ్దుల్ రహీం మోజిందర్ తన నిజాయితీ చాటుకున్నారు.తన కారులో ప్రయాణించి మరిచిపోయిన బ్యాగ్ ను పోలీసులకు అప్పగించాడు.దీంతో అల్ ఖుసైస్ పోలీసులు సన్మానం చేశారు.
3.విదేశీ యాత్రికుల హజ్ కోటా ప్రకటన
2022 ఏడాదికి గాను సౌదీ అరేబియా విదేశీ యాత్రికుల హజ్ కోటాను ప్రకటించారు.ఈ కోతాలకు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఆమోదించిందని అక్కడి మీడియా తెలిపింది.
4.మళ్లీ ఎబోలా వ్యాప్తి … ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
కాంగోలో ఏప్రిల్ మొదటి వారంలో ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్లు .ఏప్రిల్ 22న అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.అక్కడ పనిచేసిన ఆసుపత్రి సిబ్బంది లోనూ ఆ లక్షణాలు కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది.
5.నైజీరియాలో పేలుడు.100 మంది మృతి
నైజీరియాలో చమురు శుద్ధి కర్మాగారం లో భారీ పేలుడు సంభవించింది. ఈ 100 మంది మరణించినట్లు దేశ అధికారులు ధ్రువీకరించారు.
6.చైనాలో కరోనా ఉధృతి
చైనా లో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రం అవుతోంది.శని వారం ఒక్కరోజులోనే 24,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.రాజీనామా కు ఒప్పుకోని రాజా పక్సే
శ్రీలంక లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు ముదిరిపోతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని మహేంద్ర రాజా పక్సే రాజీనామా చేయాలి అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున డిమాండ్ లు వినిపిస్తుండగా దానికి రాజా పక్సే నిరాకరించారు.
8.గూగుల్ ఫేస్ బుక్ మెడలు వంచుతాం : ఐరాసా సమాఖ్య
సోషల్ మీడియా వేదికలపై రెచ్చగొట్టే అభ్యంతరకరమైన కంటెంట్ ను నియంత్రించే విధంగా టెక్ సంస్థలు గూగుల్, ఫేస్ బుక్ ల పై చర్యలు తీసుకునేందుకు చట్టాన్ని తీసుకు వచ్చినట్టు యూరోపియన్ ప్రకటించింది.
9.జపాన్ లో పడవ మునిగి 26 మంది గల్లంతు
జపాన్ లో పడవ మునిగి ఘటనలో 26 మంది గల్లంతయ్యారు.
10.శ్రీలంక కు 3834 కోట్ల రుణం
ఇంధన దిగుమతుల కోసం 500 మిలియన్ డాలర్లు ( 3834 ) కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది.
.