1.భారతీయ అసిస్టెంట్ పై వైట్ హౌస్ సెక్రెటరీ ప్రశంసలు
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రెస్ సెక్రెటరీ గా విధులు నిర్వర్తిస్తున్న జెన్ పాకి తన అసిస్టెంట్ వేదాంత్ పటేల్ పై తాజాగా ప్రశంసలు కురిపించారు.అతడు చాలా టాలెంటెడ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
2.అమెరికాలో పెరిగిన భారతీయుల సంఖ్య
అమెరికాలో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య 2021 లో పన్నెండు శాతం పెరిగినట్లు యూఎస్ సిటీ జెన్ షిప్ , ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శాఖ బుధవారం ప్రకటించింది.
3.సోను సూద్ కు గోల్డెన్ వీసా
సినీ యాక్టర్ సోనూసూద్ కు అరుదైన గౌరవం దక్కింది.దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
4.భారత్ కు ఎయిర్ అరేబియా కొత్త సర్వీస్
భారత్ ఎయిర్ అరేబియా కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ లోని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కు కొత్త సర్వీస్ ను నడపనుంది.
5.ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం
ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ బాంబుల వర్షం కురిపించింది.ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.
6.న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా ప్రధానులకు పుతిన్ షాక్
న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రధానులకు పుతిన్ షాక్ ఇచ్చారు.ఈ రెండు దేశాల ప్రధానులు రష్యా లో పర్యటించే వీలు లేకుండా బ్యాన్ విధించారు.
7.భారత్ కు రష్యా వార్నింగ్
భారత్ కు రష్యా వార్నింగ్ ఇచ్చింది.193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్య సమితి జనరల్ ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యా ను తొలగించింది.ఈ ఓటింగ్ లో పాల్గొని తమకు మద్దతుగా ఓటు వేయాలని భారత్ ను రష్యా కోరినా ఓటింగ్ కు దూరంగా ఉండడం తో అది తమకు వ్యతిరేకంగా చేసిన వ్యవహారంగా రష్యా భావిస్తూ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది.