1.త్వరలో భారతీయులకు ఈ – పాస్ పోర్ట్ లు
కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ పాస్ పోర్ట్ లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
2.ప్రవాస తల్లితండ్రుల కోసం ఆప్యాయ హెల్త్ కార్డులు
అమెరికాలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసుల తల్లితండ్రుల కోసం ‘ ఆప్యాయ హెల్త్ కార్డులు ‘ ఇచ్చేందుకు తెలంగాణ అమెరికా అసోసియేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సన్ షైన్ ఆసుపత్రుల ఎండి గురవా రెడ్డి తెలిపారు.
3.తాలిబన్ ఆర్మీ లోకి సూసైడ్ బాంబర్లు
తాలిబన్ ఆర్మీలోకి సూసైడ్ బాంబర్లని ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది.ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా నుంచి ఎదురయ్యే అతి పెద్ద ముప్పుని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.దానిలో భాగంగానే సూసైడ్ బాంబర్లను రంగంలోకి దించుతోంది.
4.ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదు : డబ్ల్యూ హెచ్వో
ఒమిక్రాన్ సాధారణ జలుబు మాదిరిగా అశ్రద్ద చేయవద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించింది.
5.హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా
హైపర్ సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది.
6.గిన్నిస్ రికార్డు సాధించిన భారత మహిళా
జడతో డబుల్ డెక్కర్ బస్సు లాగి గిన్నిస్ రికార్డు సాధించారు భారత్ కు చెందిన ఆశారాణి అనే మహిళ.
7.అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం
అమెరికాలోని పిలడెల్పియా లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తో 8 మంది పిల్లలతో సహా మొత్తం 12 మంది మరణించారు.
8.ఇమ్రాన్ ఖాన్ దొంగ అంటూ విమర్శలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విదేశీ విరాళాలు కాజేసిన దొంగ అంటూ పాకిస్థాన్ లోని విపక్షాలు విమర్శలు చేశాయి.
9.పాక్ కు తాలిబన్ల వార్నింగ్
పాకిస్థాన్ దేశాల మధ్య 2640 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం డ్యురాండ్ రేఖ విషయంలో ఇప్పుడు ఇరుదేశాల మధ్య వివాదం నెలకొంది.
.