1.పోప్ ఫ్రాన్సిస్ కు ప్రధాని మోదీ గిఫ్ట్
కేథలిక్ క్రైస్తవ మత గరువు పోప్ ఫ్రాన్సిస్ ను ప్రధాని నరేంద్రమోదీ కలిసారు .ఈ సందర్భంగా పూర్తిగా సిల్వర్ తో తయారుచేసిన క్యాండిల్ స్టాండ్ ను ప్రధాని నరేంద్రమోదీ బహుకరించారు.
2.తైవాన్ పై చైనా సంచలన వ్యాఖ్యలు
తైవాన్ దేశం చైనా లో విలీనం కావడం మినహా మరో మార్గం లేదని అమెరికా తేల్చేసింది.
3.ఐరోపా పర్యటనలో భారత ప్రధాని చర్చలు
ఐరన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ నాయకులతో వివిధ అంశాలపై చర్చించారు.
4.ప్రవాసులు నివాసితులకు కువైట్ వార్నింగ్
కువైట్ లోని నివాసితులు, ప్రవాసులకు కువైట్ వార్నింగ్ ఇచ్చింది.సముద్ర తీర ప్రాంతాలు, బీచులకు వెళ్లే సందర్శకులు నత్తలు, గవ్వలు సేకరించడం నిషేధించబడింది అని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే 62 వేల నుంచి 12.41 లక్ష వరకు జరిమానా ఉంటుందని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ హెచ్చరించింది.
5.యూఏఈ నుంచి భారత్ వెళ్లే వారికి ఎయిర్ అరబియ బంపర్ ఆఫర్
యూఏఈ కి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా సరికొత్త ఆఫర్ తో భారత్ కు విమాన సర్వీసులను ప్రకటించింది.నవంబర్ మొదటి వారం నుంచి అబుదాబీ నుంచి కొచ్చి, కోజికొడ్ , తిరువనంతపురం కు నేరుగా విమాన సర్వీసులు నడపనుంది.అబుదాబి నుంచి ఈ 3 గమ్యస్థానాలకు విమాన టికెట్ ధర 499 దిర్హంస్ గా ప్రకటించింది.
6.సింగపూర్ లో కరోనా కలకలం
సింగపూర్ లో కరోనా తీవ్రంగా విజృంభించింది.రోజురోజుకు ఒక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆదేశం ఆందోళన చెందుతోంది.
7.ప్రాన్స్ లో కేటీఆర్ ప్రసంగం
ప్రెంచ్ సెనేట్ లో ‘ యాంబీషన్ ఇండియా 2021 ‘ బిజినెస్ ఫోరం లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఏడేళ్లలో తెలంగాణ లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి కేటీఆర్ ప్రస్తావించారు.
8.రష్యాలో సంపూర్ణ లాక్ డౌన్
రష్యా లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది .కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
9.విమాన సర్వీసులపై చైనా కీలక నిర్ణయం
అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది.వచ్చే ఏడాది మార్చితో వచ్చిపోయే అంతర్జాతీయ విమానాలను వారానికి 408 కి కుడించింది.
10.యూ ఏఎన్ మూర్తి కథల పోటీలు
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం ( TAGS ) ఆధ్వర్యంలో యూ ఏ ఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీ జరుగుతోంది.
విదేశాలలో ఉన్న తెలుగువారు తమ కథ, కవితలను ఈ పోటీకి పంపించవచ్చు.
.