1.విదేశీ ప్రయాణికులపై జపాన్ కాంక్షలు
కొత్త కరోనా వేరియంట్ ఓమై క్రాన్ వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రయాణికులపై జపాన్ ఆంక్షలు విధించింది.విదేశీయుల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించింది.
2.డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో నిబంధనలు మార్చిన కువైట్
డ్రైవింగ్ లైసెన్స్ ల విషయంలో కువైట్ నిబంధనలు మార్చింది.వాహనాలు నడిపే విషయంలో ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కాదని ప్రకటించింది.
3.విదేశీ ప్రయాణికులపై కేరళ ఆంక్షలు
కరోనా కొత్త వేరియంట్ వైరస్ ప్రభావం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ముఖ్యంగా కంట్రీస్ ఎట్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనలు పాటించాలి అనే నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
4.అమెరికాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ యువకుడు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ లోని సూర్యాపేటకు చెందిన నరేంద్రుని శిరిడి సాయి ( 22) మృతి చెందారు.
5.అందాల పోటీలకు ఇజ్రాయిల్ అనుమతి
ఐ లాట్ లోని రెడ్ సీ రిసార్ట్ లో మిస్ యూనివర్స్ – 2021 పోటీలు జరుగుతాయని, కరోనా నిబంధనలు ఉన్నా ఇవి కొనసాగుతాయని ఇజ్రాయిల్ ప్రకటించింది.
6.ఓమిక్రాన్ అత్యంత ప్రమాదకరం
ఓమిక్రాన్ వైరస్ అత్యంత ప్రమాదకరం అని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్లూ హెచ్ వో హెచ్చరించింది.
7.వియత్నం అధ్యక్షుడిని కలవనున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం వియత్నం అధ్యక్షుడు జువాన్ ఫుక్ ను కలవనున్నారు.
8.ఆఫ్ఘనిస్తాన్ లో 50 శాతం స్కూళ్ల బంద్
ఆఫ్ఘనిస్తాన్ లో 50 శాతం స్కూళ్లను ఆఫ్ఘన్ ప్రభుత్వం మూసివేయించింది.
9.ట్రావెల్ ఆంక్షలు ఎత్తివేయాలని కోరిన సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు
ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా దేశంపై ప్రపంచ దేశాలు విధించిన ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయాలని సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా కోరారు.
10.ఆఫ్ఘన్ ప్రధాని విజ్ఞప్తి
ప్రపంచ దేశాలు ఆఫ్ఘన్ కు సహాయం నిలిపివేయడం సరికాదని, వెంటనే ఆఫ్ఘన్ కు తగిన సహాయం అందించాలని ఆఫ్ఘన్ ప్రధాని ముల్లార్ మహ్మద్ విజ్ఞప్తి చేశారు.