1.ఆఫ్ఘన్ లో 100 మంది భారతీయులు : ప్రధానికి లేఖ
ఇప్పటికీ వంద మంది భారతీయులు ఉన్నారు అంటూ ఇండియన్ వరల్డ్ ఫోరం , ఇతర ఎన్జీవోలు ప్రధాని కి, విదేశాంగ శాఖకు లేఖ రాశారు.
2.ఇంగ్లాండ్ వెళ్లే వారికి శుభవార్త
ఇంగ్లాండ్ లో పర్యటించాలి అనుకుంటున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.కరోనా టీకా రెండు డోసులు ఇకపై ఖరీదైన వేసుకున్న వారు ఇక పై ఖరీదైన ఆర్ టీ పీసీ ఆర్ కరోనా పరీక్ష కు బదులు చౌకైన లాటరల్ ఫ్లో టెస్ట్ చేయించుకున్నా సరే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.
3.అలస్కా లో యోగా ప్రోగ్రామ్ : పాల్గొన్న భారత బలగాలు
అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఓ సైనిక స్థావరం లో జరిగిన కార్యక్రమంలో భారత్, అమెరికా బలగాలు యోగాను అభ్యసించాయి.
4.భారత ప్రధాని విదేశీ టూర్
వచ్చే నెల రెండో తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ లో రోమ్ లో జరిగే జి 20 సమ్మీట్ , యూకే లోని గ్లాస్గో లో జరిగే సీవోపి 26 సమావేశాల్లో పాల్గొననున్నారు.
5.కరోనా పై డబ్ల్యూ హెచ్ వో స్పందన
కరోనా వైరస్ ప్రభావం ఇంకా ముగియలేదు అని, దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచం ప్రజారోగ్య సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు.బెర్లిన్ లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు లో ఆయన మాట్లాడారు.
6.ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆందోళన
ఏపీ లో టిడిపి కార్యాలయంపై జరిగిన దాడుల నేపథ్యంలో మెల్బోర్న్ లో నివసిస్తున్న ఎన్నారైలు తమ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం వారు విమర్శలు నమోదు చేశారు.
7.చైనా పై ఏ ఐ నిఘా
భారత ప్రభుత్వం కుత్రిమ మేథను రంగంలోకి దించేందుకు సిద్ధం అవుతోంది.మనుషుల్లా ఆలోచించే సాప్ట్ వేర్ లను 24 గంటలు పనిచేయనున్నాయి.
8.పాక్ లో ఇమ్రాన్ కు వ్యతిరేకంగా నిరసనలు
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాలి అని పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు.
9.చైనా , రష్యా నేవీ ఉమ్మడి గస్తీ
పశ్చిమ ఫసిపిక్ సముద్ర జలాల్లో చైనా, రష్యా నావికా దళాలు తొలిసారిగా ఉమ్మడి గస్తీ చేపట్టాయి.
10.పిల్లలకు హోమ్ వర్క్ తగ్గించేలా కొత్త చట్టం
బరువు తగ్గించేందుకు చైనా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.దీనికోసం కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన ఉంది.