1.భారతీయ బాలుడికి అరుదైన వ్యాధి ఆదుకున్న సింగపూర్ వాసులు
సింగపూర్ లో భారతీయ సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన నాడీ కండరాల వ్యాధి నుంచి కోలుకున్నాడు.కండరాల క్షీణత తో బాధపడుతున్న బాలుడికి సింగపూర్ వాసులు 30 లక్షల సింగపూర్ డాలర్లు ( 16.68 కోట్లు) విరాళంగా అందించారు.
2.సౌదీకి గుడ్ బాయ్ చెప్పిన 10 లక్షల ప్రవాస కార్మికులు
2018 నుంచి 2021 మూడో త్రైమాసికం వరకు అంటే సుమారు 45 నెలల్లో ఏకంగా 10 లక్షలకు పైగా ప్రవాస సౌదికి గుడ్ బై చెప్పారు.
3.కమల హరీస్ పై బైడన్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమల హరీస్ విషయం పై తాజాగా కీలక ప్రకటన చేశారు.2024 ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థి కమల్ హారిస్ అని ప్రకటించారు.
4.తాను క్షమాపణలు చెప్పనంటున్న అమెరికా అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు.
5.పాకిస్తాన్ లో భారీ పేలుడు
పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది.లాహోర్ లోని అనార్కలి పాన్ మండి దగ్గర జరిగిన భారీ స్వామి వీళ్ళ ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందారు.20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.
6.అమెరికాకు పునః ప్రారంభమైన ఎయిర్ ఇండియా సర్వీసులు
అమెరికాలో 5 సేవలు ప్రారంభం కావడంతో పేరు ఇండియా విమాన సర్వీసులను నిలిపి వేసిన సంగతి తెలిసిందే.అమెరికా లో ఐదు సేవలపై ఇతర దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో ఖైదీ సేవలను పూర్తిగా అమెరికా నిషేధించింది దీంతో ఇండియా నుంచి ఎయిర్ ఇండియా విమానం సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
7.భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ
చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ PLA అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ని భారత భూభాగం నుంచి అపహరించింది.
8.బ్రిటన్ సంచలన నిర్ణయం
కోవిడ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో బ్రిటన్ లో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉంది.
9.ముస్లిం దేశాలకు తాలిబన్ల విజ్ఞప్తి
ఆఫ్ఘనిస్తాన్ లోని తమ ప్రభుత్వం ను గుర్తించిన మొదటి వ్యక్తి కావాలంటూ తాలిబన్ ప్రధాన మంత్రి బుధవారం ముస్లిం దేశాలకు విజ్ఞప్తి చేశారు.
10.ప్రపంచ కురువృద్ధుడు మృతి
ప్రపంచంలోనే అత్యంత కురువృద్ధుడు గా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన శాటిర్నినో గార్షియ 112 వ ఏట మరణించారు.