1.కెనడాలో తాకా వారి సంక్రాంతి సంబరాలు
కెనడాలోని టొరంటో నగరం శృంగేరి కమ్యూనిటీ సెంటర్ నందు ‘ తాక ‘ ( తెలుగు ఆలయన్సస్ ఆఫ్ కెనడా) వారు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
2.అంతర్జాతీయ విమాన సర్వీసులు పై నిషేధం మళ్లీ పొడిగింపు
కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయం తాజాగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ విమాన సర్వీసుల పై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బుధవారం ప్రకటించింది.
3.దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక
కరోనా వైరస్ ప్రభావం తీవ్రమైన నేపథ్యంలో పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.ఇరవై రెండు దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దని స్పష్టం చేసింది.
4.డ్రోన్ దాడులకు సౌదీ ప్రతీకారం
యూఏఈ రాజధాని అబుదాబీ లోని జాతీయ చమురు కంపెనీ లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన దాడికి సౌదీ అరేబియా ప్రతీకారం తీర్చుకుంది.
ఈ దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న యొమెన్ లో అతి పెద్ద నగరమైన సనా లోని ఓ భవనంపై సౌదీ అరేబియా దాడి చేసింది.ఈ ఘటన లో14 మంది మృతి చెందారు.
5.సానియా మీర్జా సంచలన ప్రకటన
2022 సీజన్ తనకు చివరిదని, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేశారు.
6.ఓమి క్రాన్ పై డబ్ల్యూ హెచ్ వో సంచలన ప్రకటన
ఒమి క్రాన్ తో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
7.దక్షిణఫ్రికా లో విజృంభిస్తున్న ఒమిక్రాన్
దక్షిణాఫ్రికాలో ఒమి క్రాన్ కేసులు మరింత ఉధృతం అయ్యాయి.12 జనవరి, 2022 నాటికి 3,534,131 కేసులు నమోదయ్యాయి.మొత్తం 92,649 మరణాలు సంభవించాయి.అయినా అక్కడ లాక్ డౌన్ విధించేది లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
8.5 జీ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు
5 జీ టెక్నాలజీవల్ల భారత్ నుంచి అమెరికా కు వెళ్లే విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.
9.నేడు స్పేస్ వాక్
భూమికి సదూరంగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఇద్దరు వ్యామోగాములు నేడు స్పేస్ వాక్ చేయనున్నారు.