1.ఖతార్ లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖతార్ లో ఘనంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖతార్ లో ఘనంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సంబరాలు జరిగాయి.
2.బ్రిటిష్ దౌత్య అధికారిగా భారత విద్యార్థి
రాజస్థాన్ కి చెందిన అధితి మహేశ్వరి కి భారత్ లో బ్రిటిష్ దౌత్య అధికారిగా పనిచేసే అవకాశం దక్కింది.హై కమిషర్ ఆఫ్ ది డే పోటీలో పాల్గొని గెలుపొందిన ఆమెకు ఈ అవకాశం దక్కింది.
3. కిమ్ సంచలన వ్యాఖ్యలు
శాడిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పతనం అయిపోయినా జనాల ఆకలి బాధలు తీర్చాలి అంటూ ఆయన ప్రంగించడం తో అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు.
4.ఆఫ్ఘన్ లో పరిస్థితి పై అమెరికా హెచ్చరిక
ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ నగరంలో హోటళ్ళు, టూరిస్ట్ లను టార్గెట్ చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు అమెరికా హెచ్చరించింది.
5.సిడ్నీ లో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు
ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరమైన సిడ్నీ లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.107 రోజుల లాక్ డౌన్ తరువాత ఈ రోజు నగరంలో షాపులన్నీ తెరుచుకున్నాయి.
6.చైనా ఒత్తిడి కి తలోగ్గం
చైనా ఒత్తిళ్లకు తాము తలోగ్గే పరిస్థితి లేదని తైవాన్ అధ్యక్షురాలు త్సా యి ఇంగ్ వెన్ పేర్కొన్నారు.
7.అమెరికా కు చైనా వార్నింగ్
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుర్తించకుండా ఆ దేశ ప్రజలకు సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది.దీనిపై తాలిబన్లు ఘాటుగా స్పందించారు.తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలి అని చూస్తే చూస్తూ ఊరుకోబోము అంటూ హెచ్చరించింది.
8. కెనడా లో కొత్త వ్యాధి
కెనడాలో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది.కెనడా ప్రజల మెదడు కి సంబందించిన అంతు చిక్కని వ్యాధి కారణంగా తీవ్ర భయాందోళన లు నెలకొన్నాయి.
9.ఆర్ధికం లో ముగ్గురికి నోబెల్ పురస్కారం
ఈ ఏడాది ఆర్ధికం లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది.అమెరికా శాస్త్ర వేత్తలు డేవిడ్ కార్డ్ , జాషువా డీ , ఆంగ్రిస్ట్ , గైడో డబ్లూ ఇంబెన్స్ లు ఉన్నారు.
10.న్యూజిలాండ్ లో నో డోస్ నో జాబ్
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు , నర్సులు, డాక్టర్ లు, టీచర్ లు వాక్సిన్ తీసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాము అంటూ న్యూజిలాండ్ ప్రభుత్వం హెచ్చరించింది.