1.టీఆర్ఎస్ రైతు ధర్నా కు ఎన్.ఆర్.ఐ శాఖ మద్దతు
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 12 న నిర్వహించనున్న రైతు ధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు.
2.ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం
డెట్రాయిట్ అమెరికా కూటమి ఆధ్వర్యంలో గవర్నర్ గ్రేశ్చెన్ విట్మెర్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
3.ఎన్.ఆర్.ఐ అల్లుళ్ల కు షాక్
తెలంగాణ లో గృహ హింస కేసులు ఎదుర్కుంటూ విదేశాల్లో విలాసవంతంగా గడుపుతున్న ప్రవసులకి షాక్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధం అవుతోంది.ఇటువంటి వారి పాస్ పోర్ట్ ను రద్దు చేయించేందుకు సిద్ధం అవుతోంది.
4.లెబనన్ పౌరులకు విసా సర్వీసులు
లెబనన్ పౌరులకు అన్ని వీసా సర్వీసులను నిలిపివేస్తూ కువైట్ నిర్ణయం తీసుకుంది.
5.దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మృతి
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఎఫ్ డబ్లు డీ క్లేర్క్ మృతి చెందారు.
6.ఎలెన్ మాస్క్ సంచలనం
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధిపతి ఎలన్ మాస్క్ తన కంపెనీకి చెందిన 5 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారు.
7.చైనాలో కరోనా విజృంభణ
చైనాలో రోజురోజుకు కరోనా తీవ్రంగా విజృంభిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
8.భారత్ కు రాబోతున్న రష్యా అధ్యక్షుడు
త్వరలనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత్ లో పర్యటించనున్నారు.
9.కరోనా ఐదో దశ – హెచ్చరించిన ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి
కోవిడ్ ఐదో దశ దేశంలో త్వరలో ప్రారంభం కావచ్చని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్య మంత్రి ఆలివర్ వెరాన్ హెచ్చరించారు.
10.జర్మనీలో కరోనా బీభత్సం
జర్మనీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.జర్మనీలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
.