1.కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన
కువైట్ లో భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం ) ఎంబసీ మూసి ఉంటుంది అని అధికారులు తెలిపారు.అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు ఎటువంటి అంతరాయం ఉండదని తెలిపారు.
2.ప్రవాసుల విజయాలపై గర్విస్తున్నాం : మోదీ
మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.అదే సమయంలో వారు తమ మూలాలను మరువలేదు.వారి విజయాల పట్ల మేము గర్విస్తున్నాం అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
3.అమెరికా పౌరసత్వం లేకపోయినా ఓటు హక్కు
అమెరికా పౌరసత్వం లేని వారికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ న్యూయార్క్ సిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
4.షార్జా వెళ్లేవారికి శుభవార్త
స్పైస్ జెట్ షార్జా వెళ్లే వారికి చెప్పింది.
భారత్ లోని మూడు నగరాల నుంచి షార్జా కు విమాన సర్వీసులను ప్రారంభించింది. పూణే, మధురై, మంగళూరు నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
5.చంద్రుడిపై నీటిని కనుగొన్న చైనా వ్యామోనౌక
చంద్రుడిపై నీటి ఆనవాళ్లను చైనా వ్యామో నౌక కనుగొంది.
6.కజికిస్తాన్ లో ఆందోళనలు.,164 మంది మృతి
కజికిస్థాన్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్ల కారణంగా 164 మంది మరణించారు.
7.అంగసాన్ సూకీ కి మరో నాలుగేళ్ల శిక్ష
మయన్మార్ నేత అంగాసాన్ సూకీ కి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.అక్రమంగా వాకీ టాకీలు కలిగి ఉన్న కేసులో ఈ శిక్ష విధించారు.
8.మీడియాకు కొత్త నిబంధనలు విధించిన తాలిబన్లు
కాబూల్ యూనివర్సిటీ లో లా అండ్ పొలిటికల్ సైన్స్ ఫ్రొఫెసర్ ఫైజుల్లా జులాల్ ను తాజాగా అరెస్ట్ చేశారు.సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలోనే ఈ ఉదాంతం చోటు చేసుకుంది.
9.బ్రిటన్ లో కరోనా ఉదృతి తీవ్రం
బ్రిటన్ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.ఇప్పటి వరకు కరోనా ప్రభావం తో 1,50,000 మంది మరణించారని ప్రభుత్వం పేర్కొంది.