1.న్యూ యార్క్ లో భారతీయ డ్రైవర్ పై దాడి.
న్యూయార్క్ లో జాన్ కెన్నెడీ విమానాశ్రయం బయట భారత సిక్కు టాక్సీ డ్రైవర్ పై ఓ అమెరికన్ దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై ఇండియన్ కన్సులేట్ మండిపడింది.
2.నేడు భారతీయ ప్రవాస్ దినోత్సవం
భారత అభివృద్ధికి విదేశాల్లో ఉన్న భారతీయులు వారి సహకారాన్ని, వారి ప్రాధాన్యత ను గుర్తించి గౌరవించుకోవడానికి ప్రతి ఏటా భారతీయ ప్రవాస దినోత్సవం ను జరుపుకుంటున్నారు.
3.ప్రపంచవ్యాప్తంగా కరోనా
ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 22 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.బ్రెజిల్ లో విరిగిపడిన కొండచరియలు .ఏడుగురు మృతి
వాటర్ ఫాల్స్ లో బోటు పై షికారు కు వెళ్లిన వారిపై కొండచరియలు విరిగి పడిన ఘటన మినాస గైరాస్ స్టేట్ లో ఉన్న పాపులర్ డిస్టినేషన్ క్యాపిటోలియా కానియెన్స్ లో జరిగింది
5.భారత జలాల్లోకి పాక్ బోటు
భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన యాసిన్ బోటు ను భారత కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బోటు లో పదిమంది పాకిస్తానీయులు ఉన్నారు.
6.కరోనా పై డబ్ల్యూహెచ్ వో వార్నింగ్
కరోనా పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో వార్నింగ్ ఇచ్చింది.కరోనా ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
7.డ్రాగన్ ఫ్రూట్ లో కరోనా ఆనవాళ్లు .నిషేధం విధించిన చైనా
డ్రాగన్ ఫ్రూట్ లో కరోనా ఆనవాళ్లు గుర్తించడం తో దిగుమతి పై చైనా నిషేధం విధించింది.
8.నైజీరియాలో మారణ హోమం
నైజీరియాలో ముష్కరులు మారణ హోమం సృష్టించారు.ఈ వారం రోజుల్లో జరిగిన దాడిలో 140 మంది వరకు మరణించారు.
9.నిల్సన్ మండేలా జైలు గది తాళం వేలం నిలిపివేత
నిల్సన్ మండేలా జైలు గది తాళం వేలం నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వేలాన్ని నిలిపివేస్తూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.