1.కువైట్ ఇండియన్ ఎంబసీ లో కరోనా కలకలం
కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఈ నెల ఆరో తేదీన నిర్వహించిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ,కొద్ది రోజుల పాటు రాయబార కార్యాలయం లో ప్రజా సేవలు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
2.సౌదీ అరేబియా లో కొత్త రెసిడెన్సీ పర్మిట్లు
సౌదీ అరేబియాలో వాలసదారులకు పరిమిత గడువులో కూడిన రెసిడెన్సీ పర్మిట్ లను విడుదల చేసింది.
3.సింగపూర్ తెలుగు సమాజం వారి STS కనెక్ట్స్ ప్రారంభం
సింగపూర్ లో నివసించే వారి ప్రయోజనం కోసం , అందరిలో వివిధ టెక్నాలజీ పై అవగాహన కోసం నవంబర్ 6 న sts కనెక్ట్స్ ను ప్రారంభిచింది సింగపూర్ తెలుగు సమాజం.
4.ఆఫ్ఘన్ లో దారుణం
ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పరిస్ధతులు ఆందోళనకరంగా నే ఉన్నాయి. తాజాగా ఆఫ్ఘన్ లో మహిళా హక్కుల కార్యకర్త ప్రోజన్ సఫి తో సహా నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
5.ప్రధాని ఇంటి పై డ్రోన్ దాడి
ఇరాక్ ప్రధాని ముస్తఫా ఆల్ కదిమి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది.ఈ ఘటనలో ప్రధాని సురక్షితంగా బయటపడ్డారు.
6.మాదకద్రవ్యాల కేసులో
భారతీయ మూలాలు ఉన్న మలేషియన్ నాగేంద్రన్ ధర్మలింగానికి ఉరి శిక్ష విధించబోతుండడాన్ని సింగపూర్ సమర్థించుకుంది.
7.ప్రపంచ వ్యాప్తంగా మోదీ కి పెరిగిన క్రేజ్
ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కి క్రేజ్ పెరిగినట్టు మార్నింగ్ కన్సల్ట్ చేసిన సర్వే లో తేలింది.
8.డెల్టా వేరియంట్ కలకలం
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు వంచి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రక్యతలు పొందిన కివీస్ లో ఇప్పుడు డెల్టా వేరియంట్ కలకలం రేపుతోంది.రోజు రోజుకీ కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతూ ఉండడం తో అక్కడి ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
9.లాహోర్ కోర్టు సంచలన తీర్పు
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన వ్యవహారంలో ముంబై దాడుల కేసు సూత్రధారి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ అనుచరులను లాహోర్ కోర్టు శనివారం నిర్దోషులుగా ప్రకటించింది.