1.అమెరికాలో వెళ్తూ ఆరుగురు భారతీయుల అదృశ్యం
టర్కీ మీదుగా అమెరికా వెళ్తూ ఆరుగురు భారతీయులు అదృశ్యం అయిన ఘటన సంచలనం రేపుతోంది.దీనిపై ఇస్తాంబుల్ లోని ఇండియన్ ఎంబసీ దృష్టి పెట్టడం తో పోలీసులూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
2.భారత్ కు వెళ్లే ప్రయాణికుల కు అమెరికా కీలక సూచన
భారత్ కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు అమెరికా కీలక సూచన చేసింది.భారత్ కు ప్రయాణించే విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని సూచించింది.
3.విదేశీ ట్రక్ డ్రైవర్ లకు వీసా .సౌదీ కీలక నిర్ణయం
విదేశీ ట్రక్ డ్రైవర్ లు సౌదీ లో ప్రయాణించేందుకు వీసా తీసుకోవాలనే నిబంధన ను అమలు చేయాలని సౌదీ నిర్ణయించుకుంది.
4.దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ రక్తదాన శిబిరం
దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ రక్తదాన శిబిరం ను నిర్వహించింది.ఈ సంస్థ చైర్మన్ ఉగ్గిన దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
5.హాంకాంగ్ లో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు
హాంకాంగ్ లో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుప్ట్లుతున్నట్టు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు.
6.వారంలో రెండు కోట్ల కొత్త కరోనా కేసులు
వారంలో రెండు కోట్ల కొత్త కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూశాయి.
7.గూగుల్ సీఈవో పై కేసు నమోదు
గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ పై కాపీ రైట్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది.” ఏక్ హసీనా థి ఏక్ దివానా థా ” అనే సినిమాకు సంబంధించి తమకు సంబంధం లేకుండా యూ ట్యూబ్ లో అప్లోడ్ చేశారంటూ కేసు పెట్టడం తో సుందర్ పిచాయ్ తో పాటు మరో నలుగురి పై కేసు నమోదు అయ్యింది.
8.ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు అలెర్ట్
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తం గా ఉండాలని ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
9.భారత్ కు గణతంత్ర శుభాకాంక్షలు చెప్పిన బ్రిటన్
భారత్ కు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు.
.