సంక్రాంతికి రావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో వెంటనే డీజే టిల్లు సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఈమద్య కాలంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్నారు.
వారి నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.కనుక డీజే టిల్లు ఖచ్చితంగా సంక్రాంతికి కుమ్మేస్తుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా సంక్రాంతికి డీజే టిల్లు విడుదల కాలేదు.డీజే టిల్లు ను సంక్రాంతి పోటీ లో విడుదల చేయడం ఎందుకు అన్నుకున్నారా లేదంటే మరేదైనా కారణం ఉందో కాని డీ జే టిల్లు సినిమా ను విడుదల చేయడం వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
డీజే టిల్లు ను జనవరి 26వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా కొత్త తేదీని ప్రకటించారు.కాని తాజాగా ఆ తేదీకి కూడా వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
డీ జే టిల్లు విడుదల తేదీ మళ్లీ మారినట్లుగానే అనిపిస్తుంది.రిపబ్లిక్ డే కు పరిస్థితులు అనుకూలంగా ఉంటే విడుదల చేయాలనుకున్నారు.
కాని కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి.ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడుస్తున్నాయి.ఈ సమయంలో డీ జే టిల్లు ను విడుదల చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనే విశ్లేషన అందరిలో వ్యక్తం అవుతుంది.అందుకే ఈ సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
డీ జే టిల్లు సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నా కూడా విడుదల మాత్రం కావడం లేదు.ఈ సినిమా విడుదల కాకున్నా గుడ్ లక్ సఖి సినిమా ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.
కనుక థియేటర్ల పరిస్థితి ఎలా ఉన్నా డీ జే టిల్లు సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ టిల్లు గాడి కొత్త డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.యూత్ లో ఈ సినిమా కు మంచి క్రేజ్ ఉంది.ఎప్పుడు వచ్చినా జనాలు ఆధరించడం ఖాయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.