తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన “పిల్లా నువ్వులేని జీవితం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి “మెగా హీరో సాయి ధరమ్ తేజ్” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. అయితే ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, మిత్రులు మరియు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఇందులో భాగంగా తనకి వరుసకు మరదలు అయ్యేటువంటి “నిహారిక కొణిదెల కూడా సాయి ధరమ్ తేజ్ కి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.అంతేకాక సాయి తాను మరియు సాయి ధరమ్ తేజ్ తీసుకున్నటువంటి ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే టూ యు మై బంగారు బావ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన అధికారిక ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.అంతేగాక సాయి ధరమ్ తేజ్ తో తాను చిన్నప్పుడు దిగినటువంటి ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తెలుగులో నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ లు మరియు పోస్టర్లు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే తమిళంలో మంచి విజయం సాధించినటువంటి ఓ చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్ తెలుగులోకి రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
.