తెలుగు సాహితీ లోకంలో ఎంతో మంది కవులు, కళాకారులు వున్నారు.అయితే ప్రస్తుతం తెలుగు సాహితీ లోకంలో పుస్తక రచయితల సంఖ్య భాగా తగ్గిపోయిందని చెప్పాలి.
అయితే ఇంకా కొంత మంది సాహిత్యకారులు, తెలుగు సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ, తెలుగుని బ్రతికించే పని చేస్తూ వుంటారు.ఇదిలా వుంటే తెలుగు సాహితీ ప్రపంచంలో విశేషమైన కీర్తి సొంతం చేసుకున్న రచయిత ద్వానా శాస్త్రీ మృతి చెందారు.
ద్వానా శాస్త్రీ అనే కలం పేరుతో గుర్తింపు పొందిన ద్వాదశి నాగేశ్వర శాస్త్రీ హైదరాబాద్ లో తన కుమారుడు ఇంట్లో ప్రస్తుతాన్ వుంటున్నారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ద్వానా శాస్త్రీ రాసిన తెలుగు సాహితీ చరిత్ర పుస్తకం విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆయన చేసిన ఎన్నో రచనలు ఎంతో గుర్తింపు పొందాయి.ఇదిలా వుంటే దానా శాస్త్రీ మరణ వార్త తెలుసుకున్న తెలుగు సాహితీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేసారు.