పాత నీరు పోతున్న కొద్దీ.కొత్త నీరు వచ్చి చేరుతుంది.
ఎక్కడైనా అంతే.ఏ రంగంలోనైనా పాతవారు పోతూనే ఉంటారు.
కొత్తవారు వస్తూనే ఉంటారు.తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఇదే రకమైన తంతు కొనసాగుతుంది.
పాత హీరోయిన్లు ఫేడౌట్ అవుతూనే ఉన్నారు.కొత్త వాళ్లు వచ్చి చేరుతూనే ఉన్నారు.
అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన నటీమణులంతా వేరే భాషల్లోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు.దీంతో కొత్త హీరోయిన్లు వేటలో పడ్డారు తెలుగు దర్శకులు.
సరిలేరు నీకెవ్వరూ.బీష్మ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఇందులో హీరోయిన్ గా చేసిన రష్మిక మందానకు ఓ రేంజిలో పేరొచ్చింది.
అయితే ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తాయని భావించారు అందరూ.దర్శకుడు త్రివిక్రమ్ కూడా అదే మాట చెప్పాడు.
కానీ ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప సినిమా తప్ప మరే పెద్ద ప్రాజెక్టు లేదు.దీంతో పాటు శర్వానంద్ హీరోగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా మాత్రమే చేస్తుంది.
ఇంచుమించు పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది.అల వైకుంఠపురము బంఫర్ హిట్ తో ఆమెకు మంచి పేరు వచ్చింది.అయితే హిందీలో ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నా.తెలుగలో మాత్రం పెద్దగా ఆఫర్లేవీ రాలేదు.గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు ఆచార్య సినిమాలో కంటిన్యూ చేస్తుంది.హరీష్-పవన్ కాంబోలో వస్తున్న ఓ సినిమాలో పూజా నటిస్తుందని వార్తలు వచ్చాయే తప్ప.
ఇంత వరకూ అవి నిజం కాలేదు.
కొద్ది రోజుల ముందు వరకు తెలుగు తెరను ఏలిన ఈ ఇద్దరు భామలు ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బిజీ అయ్యారు.దీంతో మంచి హీరోయిన్ల కోసం తెలుగు ఫిల్మ్ మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.మహేష్ తో త్రివిక్రమ్ తాజాగా చేయబోతున్న సినిమాలో మాళవిక మోహనన్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్- శంకర్ మూవీలో కూడా ఈమెనే ఓకే చేయబోతున్నట్లు సమాచారం.కొరటాల- ఎన్టీఆర్ మూవీలో జాన్వీ కపూర్ చేయబోతతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.కృతి శెట్టి, నజ్రియా నజీమ్ లాంటి కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారట.