తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి “బీరువా” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ఢిల్లీ భామ “సురభి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంత మేర అవగాహనలోపించడంతో సినీ అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
దీనికితోడు ఇప్పటివరకు తెలుగులో తనకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేకపోవడంతో సినీ పరిశ్రమలో హీరోయిన్ గా తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటుంది.
ఈ క్రమంలో తను చిన్నప్పుడు సైకిల్ తొక్కుతు తీసుకున్నటువంటి ఫోటో ని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో సురభి అభిమానులు చిన్నప్పుడు సురభి చాలా అందంగా ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన కొంత కాలంలోనే దాదాపు లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన “ఓటర్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో సురభి నటించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ అమ్మడుకి గుర్తింపు రాలేదు.ప్రస్తుతం తెలుగులో దాదాపుగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే తమిళంలో కూడా ఇటీవలే యంగ్ హీరో జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.