తెలుగులో నూతన దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వం వహించిన “అరవింద్2” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైన హీరోయిన్ “శ్రీ రెడ్డి” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటి శ్రీ రెడ్డి సినిమా పరిశ్రమలో ఎక్కువగా తాను నటించిన సినిమాలతో కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అయింది.
కానీ అనుకోకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురి కావడంతో ప్రస్తుతం చెన్నైలో నివాసముంటోంది. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
అయితే తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో “నన్ను పెళ్లి చేసుకుంటావా.?” అని అడిగాడు. దీంతో శ్రీ రెడ్డి చాలా సరదాగా స్పందిస్తూ నాకు తమిళ్ అజిత్ మరియు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ రిప్లై ఇచ్చింది.
అంతేగాక తాను ద్రౌపది లాగా ఐదుగురిని పెళ్లి చేసుకోవాలని ఉందని కానీ అదిఇక్కడ సాధ్య పడదంటూ ఫన్నీ గా చెప్పుకొచ్చింది.
అలాగే తనకు నందమూరి నటసింహం బాలయ్య బాబు చిత్రంలో నటించాలని ఉందని తన ఈ కల ఎప్పుడు నెరవేరుతుందా…? అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నానని కూడా తన మనసులో మాటను బయట పెట్టింది.అలాగే మరో నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన షర్ట్ కి ఉన్నటువంటి గుండీ విప్పి చూపించమని కామెంట్ చేశాడు దీంతో రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ తన చేతికి ధరించిన గుండీ ని విప్పి చూపించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీ రెడ్డి తెలుగులో “క్లైమాక్స్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ కూడా విడుదల కావడంతో మంచి స్పందన లభించింది.దీంతో తొందర్లోనే ఈ చిత్ర విడుదల తేదీ కి సంబందించిన వివరాలని తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.