తెలుగులో దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ చిత్రానికి రీమేక్ గా ఉంది.
అయితే ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ పనుల దాదాపుగా పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది ఎవరనే విషయం పై సరైన క్లారిటీ లేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కోలీవడ్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ప్రముఖ ఇన్ఫర్మేటిక్ వెబ్ సైట్ అయిన వికీపీడియా కన్ఫర్మ్ చేసింది.
అయితే శృతి హాసన్ కూడా పలు వ్యక్తిగత కారణాల వల్ల దాదాపుగా మూడేళ్ల కాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది. దీంతో ఇటీవలే పవన్ కళ్యాణ్ చిత్రంలో ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చెప్పింది.
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా గతంలో శృతి హాసన్, పవన్ కళ్యాణ్ కలసి జంటగా నటించిన “గబ్బర్ సింగ్” చిత్రం ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను ఎంచుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మూడేళ్ల క్రితం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు.
దాంతో తమ అభిమాన నటుడు ఒక్కసారిగా ఈ సినిమాల్లో నటించడం మానేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కానీ వకీల్ సాబ్ చిత్రంలో మళ్లీ నటిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకోవడంతో పాటు భారీ అంచనాలను కూడా బాగానే పెట్టుకున్నారు.
మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అంచనాలను అందుకుంటాడా లేదో చూడాలి.