ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమ శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని ని పోలీసులు అదుపులోకి తీసుకొని గత వారం రోజులుగా విచారణ చేస్తున్నారు.
అంతేకాకుండా మరో కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ని కూడా అరెస్టు చేసి ప్రత్యేక సెల్ నుంచి విచారిస్తున్నారు.ఈ విచారణలో సంజన తెలిపిన డ్రగ్స్ ముఠాకి చెందినటువంటి మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
అయితే తాజాగా పోలీసుల విచారణలో కర్ణాటకలోని చమ్రాజ్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కూడా ఈ కేసులో ఉన్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేగాక గతంలో జమీర్ అహ్మద్ హీరోయిన్ సంజన తో కలిసి శ్రీలంక దేశంలో జరిగినటువంటి ఓ డ్రగ్స్ పార్టీకి వెళ్లి బాగానే ఎంజాయ్ చేశాడని పలు కథనాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
దీనికితోడు పోలీసుల విచారణలో కూడా ఇదివరకే ఈ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ సంబర్గీ కూడా ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ గురించి పలు కీలక విషయాలను పోలీసులకు తెలపడంతో అతడిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి సంజన ను మరో రెండు రోజుల పాటు విచారణ నిమిత్తమై రిమాండ్ లోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
అయితే నటి సంజన మాత్రం తాను మత్తుమందు పదార్థాలను వినియోగించ లేదని చెబుతుండడంతో పోలీసులు ఇటీవలే ఆమె రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఎలాంటి వివరాలను పోలీసులు బయటకు తెలుపలేదు.