ఆ హీరోయిన్ చనిపోవడం వల్లే సదా కి జయం సినిమా ఆఫర్ వచ్చిందట...

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “జయం” అనే సినిమా సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అంతేగాక ఈ చిత్రంలో హీరోగా నటించిన యంగ్ హీరో నితిన్ తన మొదటి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.

 Telugu Heroine Sada Jayam Movie Offer News,  Sada, Telugu Heroine, Jayam Movie,-TeluguStop.com

 ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సదా కి కూడా ఈ చిత్రం బోలెడన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది.

అయితే ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటి ప్రత్యూష ని నటింపజేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నప్పటికీ అనుకోకుండా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వరించింది.

 తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి ప్రత్యూష తల్లి కూడా ఈ విషయంపై స్పందిస్తూ తన కూతురు చనిపోయే రోజు తనకి దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న “జయం”  చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని అందుకు చాలా సంతోషంగా ఉందని ఫోన్ చేసి చెప్పిందని తెలిపింది.కానీ ఇంతలోనే అలా జరుగుతుందని తన కలలో కూడా అనుకోలేదని ఎమోషనల్ అయ్యింది.

కాగా ఈ చిత్రంలో సదా కూడా తన పాత్రకి రాగానే న్యాయం చేసింది. అందుకే ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో సదా సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో ఎందుకో విఫలమవుతోంది. ఆ మధ్య కొంతమేర బోల్డ్ తరహా పాత్రలో “శ్రీమతి 21ఎఫ్” అనే చిత్రంలో నటించినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేక పోయింది.

దీంతో ప్రస్తుతం తమిళంలో పలు డాన్స్ షో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube