తెలుగులో ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన “కృష్ణార్జున యుద్ధం” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ముంబై బ్యూటీ రక్సార్ దిల్లన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించడానికంటే ముందుగా “రన్ ఆంటోని (కన్నడ), ఆకతాయి” అనే చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కానీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ “కృష్ణార్జున యుద్ధం” చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడికి మంచి ఫేమ్ వచ్చింది.
హీరోయిన్ గా అయితే మంచి గుర్తింపు వచ్చింది కానీ సినిమా అవకాశాలు మాత్రమే ఈ అమ్మడికి తలుపు తట్టడం లేదు.
దీనికితోడు ఇటీవల రుక్సార్ హీరోయిన్ గా నటించిన ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూస్డ్ దేశీ) అనే చిత్రం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో ఈ అమ్మడు కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర విఫలమవుతోంది.అయితే ఆ మధ్య హిందీ లో నూతన దర్శకురాలు స్నేహ తరుణి దర్శకత్వం వహించిన “భాంగ్రా పా లే” అనే హిందీ చిత్రంలో కూడా నటించి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి నిరాశ తప్పలేదు.దీంతో ఈ మధ్యకాలంలో రుక్సర్ ధిల్లాన్ సోషల్ మీడియా మధ్య మరో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
ఇందులో భాగంగా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తోంది. అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఖచ్చితంగా బోల్డ్ గా అయినా సరే నటించేందుకు సిద్ధం అంటోంది ఈ ముంబై బ్యూటీ.
అయితే వచ్చీరావడంతోనే నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు తన తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతోనే ఈ అమ్మడి కెరియర్ కొంతమేర మందగించిందని కొందరు చర్చించుకుంటున్నారు.