తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించిన ఏమైంది ఈ వేళ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి సినిమా పరిశ్రమలో తెలియబెని వారుండరు.అయితే ఈ అమ్మడు టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి అయినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని సినిమా అవకాశాలు దక్కించుకుంది.
ఈ క్రమంలో సోలో, సుకుమారుడు, సరదాగాఅమ్మాయితో, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.
అయితే ఏమైందో ఏమో గాని కెరియర్ పరంగా బాగానే రాణిస్తున్న సమయంలో ముంబైకి చెందిన కరణ్ వాలేచా అనే ఓ పారిశ్రామిక వేత్తని నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత నిషా అగర్వాల్ సినిమాలలో నటించడం పూర్తిగా మానేసింది.కాగా ప్రస్తుతం నిషా అగర్వాల్ కి ఒక కొడుకు ఉన్నాడు.అయితే ఈ మధ్య కాలంలో నిషా అగర్వాల్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు తన అభిమానుల అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇస్తోంది.తాజాగా ఓ నెటిజన్ మీరు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నార .? అని నిషా అగర్వాల్ ని ప్రశ్నించాడు.దీంతో నిషా అగర్వాల్ అవునని సమాధానం చెప్పింది.
కానీ తాను నటిస్తున్న చిత్ర వివరాలు మాత్రం తెలియజేయలేదు.
అయితే ఈ మధ్య కాలంలో నిషా అగర్వాల్ పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన అందమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది.
దీంతో నిషా అగర్వాల్ కొంతమేర గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాజల్ అగర్వాల్ తో సన్నిహితంగా ఉంటున్న ఓ డైరెక్టర్ నిషా అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు గాను సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.