తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “చిరుత” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “నేహా శర్మ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ అమ్మడు తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కానీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది.అంతేకాకుండా వచ్చీరావడంతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.
దీంతో తాజాగాఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నేహా శర్మ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోతో అప్పట్లో ప్రేమలో పడిందని, కానీ ఈ ప్రేమ గురించి ఆ హీరో ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరిగిందట.
దీంతో నేహా శర్మ తెలుగు సినిమా పరిశ్రమ ని వదిలి పెట్టి బాలీవుడ్ కి వెళ్ళిపోయిందని పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కానీ నేహాశర్మ బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతం పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడట.
దీంతో నేహా శర్మ బాయ్ ఫ్రెండ్ ఎవరా.? అంటూ నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య నేహా శర్మ తన సోదరి ఆయేషా శర్మ తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.కాగా ఆయేషా శర్మ బాలీవుడ్ లో ప్రముఖ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించినటువంటి “సత్యమేవ జయతే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
కాగా నేహా శర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతోంది.ఇటీవలే “ఇక్ సందు ఉందా సి” అనే పంజాబీ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.