సినిమా పరిశ్రమలో ఎలాగైనా ఒక్క ఛాన్స్ దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకోవాలని ఎంతోమంది కలలు కంటుంటారు.కానీ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోక పోగా డబ్బు సంపాదించాలని అడ్డదారుల్లో వెళుతూ చివరికి సినీ కెరియర్ ని పాడు చేసుకున్నటువంటి నటీనటులు ఎందరో ఉన్నారు.
అయితే తెలుగులో నూతన దర్శకుడు రవి కుమార్ దర్శకత్వం వహించిన “ప్రేమ ప్రయాణం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ నీతూ అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు సూపరిచితమే.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ ప్రేమ ప్రయాణం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకోలేకపోయింది.ఈ క్రమంలో పలు ఆర్థికపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంది.
ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించుకునేందుకు గాను అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి మార్గాలని ఎన్నుకుంది.ఈ క్రమంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకటి, రెండు చిత్రాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాతతో కలిసి ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది.
దీంతో ఈ అమ్మడిపై ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా కేసును కూడా నమోదు చేశారు.దీంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ముగిసిపోయింది.
కెరీర్ పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నీతూ అగర్వాల్ అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే తన దురాశ తన కెరియర్ ముగిసిపోవడానికి కారణమైందని కొందరు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక కష్టపడి పని చేస్తే ఎక్కడైనా మంచి లైఫ్ ఉంటుందని అంతే తప్ప డబ్బు సంపాదన కోసమో లేక మరే ఇతర విషయాల కోసంగాని అడ్డదారుల బాట పడితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని కొందరు నెటిజన్లు అంటున్నారు.అయితే ఇదే చిత్రంలో హీరోగా నటించిన “మనోజ్ నందం” ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నాడు.