తెలుగులో ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ హీరోగా నటించినటువంటి “జక్కన్న” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “మన్నారా చోప్రా” గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే ఫర్వాలేదనిపించడంతో వరుసగా హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.
కానీ ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలలో ఎక్కువగా కామియో అప్పియరెన్స్, గెస్ట్ అప్పియరెన్స్ తదితర పాత్రలలో నటించింది. దీంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
అంతేగాక ప్రస్తుతం ఈ అమ్మడికి తనకంటూ చెప్పుకోవడానికి సినిమా పరిశ్రమలో సరైన హిట్ లేక పోవడంతో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే గతంలో మన్నారా చోప్రా నటించిన “రోగ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండో హీరోయిన్ గా నటించడంతో కొంతమేర మైనస్ అయ్యింది.దీనికితోడు గత ఏడాది ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “సీత” చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అసిస్టెంట్ పాత్రలో నటించింది.
దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం ఇలాంటి పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వస్తున్నాయని సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు రావడం లేదని బలంగా టాక్ వినిపిస్తోంది. దీంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ సినిమా పరిశ్రమలో నటనా ప్రతిభతో పాటు మనం ఎంచుకున్న పాత్రలు ప్రాధాన్యత కూడా మన సినీ జీవితాన్ని నిర్ణయిస్తాయని కాబట్టి ఏదైనా పాత్రలో నటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు చేతిలో లేవు. దాంతో ఇంటిపట్టునే ఖాళీగా గడుపుతోంది.
కానీ అప్పుడప్పుడు ప్రముఖ ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో అందమైన ఫొటోలకి ఫోజులు ఇస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడికి టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం తలుపు తట్టినప్పటికీ మన్నారా చోప్రా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.