బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.కాగా ఈ అమ్మడు ఆ మధ్య తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేన చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రం హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో కియారా అద్వానీ తెలుగు ఇండస్ట్రీపై కొంత మేర ఫోకస్ తగ్గించింది.
కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
కాగా ప్రతి ఏడాది ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ నిర్వహించే ఫోటోషూట్ కార్యక్రమాలలో భాగంగా కియారా అద్వానీ తన లేలేత అందాలను ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అయితే కియారా అద్వానీ బీచ్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.అంతేకాకుండా కియారా అద్వానీ ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అయ్యారు.
అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే 13 లక్షల పైచిలుకు మంది లైక్ చేశారు.అలాగే ఈ ఫోటోలోపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ బీచ్ లో కియారా అద్వానీ సెమీ న్యూడ్ ఫొటోలతో సెగలు రేపుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కియరా అద్వాని కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.
గత ఏడాది కూడా డబూ రత్నానీ ఫోటో షూట్ కోసం కియారా అద్వానీ అరిటాకుని అడ్డుపెట్టుకొని ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతంకియారా అద్వానీ హిందీలో దాదాపుగా నాలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఇటీవలే ఈ అమందు హీరోయిన్ గా నటిస్తున్న షేర్ షా అనే చిత్రం షూటింగ్ పూర్తికావడంతో ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “మిస్టర్ లీలే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.