తెలుగులో నేను శైలజ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మహానటి చిత్రంతో తనలో ఉన్నటువంటి నటన ప్రతిభని నిరూపించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటనా ప్రతిభకు కొదవ లేకపోవడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది.
అయితే తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తొందర్లోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతమంది తెగ చర్చించుకుంటున్నారు.
అలాగే కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కి ఇప్పటికే ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాలలో రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారాలు మరియు మరిన్ని ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయట.అంతేకాక కీర్తి సురేష్ కి కాబోయే వ్యక్తి తన తల్లికి దూరపు చుట్టం అవుతాడని కూడా మరి కొందరు చర్చించుకుంటున్నారు.
కానీ ఇప్పటివరకు కీర్తి సురేష్ పెళ్లి పై వినిపిస్తున్న వార్తల గురించి మాత్రం కీర్తి సురేష్ గాని ఆమె కుటుంబ సభ్యులుగాని ఏమాత్రం స్పందించలేదు.దీంతో ఈ వార్తల్లో నిజం ఎంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.కాగా ఆ మధ్య కీర్తి సురేష్ మెయిన్ లీడ్ పాత్రలో నటించిన మిస్ ఇండియా చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.
దీంతో కథల పట్ల కొంత మేర ఆచితూచి అడుగులు వేస్తోంది కీర్తిసురేష్.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి గీత గోవిందం మూవీ నేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.