టాలీవుడ్ లో సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఇటీవలే ముంబై నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త “గౌతమ్ కిచ్చులు” ని దాదాపుగా మూడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి మాల్దివస్ కి హనీమూన్ కి వెళ్ళింది.
అయితే ఎప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండేటువంటి కాజల్ అగర్వాల్ తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ తన భర్త తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అంతేగాక తనకు సముద్రం అంటే చాలా ఇష్టమని కూడా క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో కొందరు కాజల్ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే లక్షలసంఖ్యలో లైకులు వచ్చాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “భారతీయుడు-2” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అలాగే కాజల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది.