తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “లక్ష్మీ కళ్యాణం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “కాజల్ అగర్వాల్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కాజల్ అగర్వాల్ కొంతమేర అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ క్రమక్రమంగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.
అయితే కాజల్ అగర్వాల్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువ దాదాపుగా 730 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.
కాగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో తాను నటించే చిత్రాల ద్వారా ఒక్కో చిత్రానికి దాదాపుగా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోందని, దీనికితోడు హైదరాబాద్ ముంబై, చెన్నై, బెంగళూరు, తదితర ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ సంబంధిత ఆస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే బంగారం, హోటళ్లు, ట్రావెలింగ్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏటా కోట్ల రూపాయలు లాభం ఆర్జిస్తోంది.
అందువల్లనే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా అత్యంత ధనవంతులైన నటీనటుల్లో ఒకరుగా ఉంది.
అయితే ఇటీవలే కాజల్ అగర్వాల్ ముంబైకి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో ఈ మధ్య కాలంలో ఈమె ఆస్తుల విలువ మరింత పెరిగింది.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.
కాగా ఇటీవలే కాజల్ టాలీవుడ్ మంచు హీరో మంచు విష్ణు హీరోగా నటించిన “మోసగాళ్లు” అనే చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేలపోయింది.
దీంతో తన తదుపరి చిత్ర కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం కాజల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లాహి లాహి అనే లిరికల్ సాంగ్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.