తెలుగులో నూతన దర్శకుడు డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన “రొమాన్స్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన మహారాష్ట్ర బ్యూటీ “డింపుల్ చోపడే” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే కుర్రకారుని తన అందాల ఆరబోతతో బాగానే ఆకట్టుకుంది.
దాంతో హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా మొదట్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది.కానీ ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.
దీంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.
అయితే తెలుగులో డింపుల్ చోపడే హీరోయిన్ గా రొమాన్స్, బిస్కెట్, గ్రీన్ సిగ్నల్, తుంగ భద్ర, కృష్ణాష్టమి తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కానీ ఇందులో రొమాన్స్, తుంగభద్ర, చిత్రాలు తప్ప మిగిలిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.దీంతో సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమై ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.
దీంతో తొందర్లోనే డింపుల్ చోపడే ముంబై కి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపిస్తున్నాయి.
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు.
దీంతో ఈ అమ్మడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం డింపుల్ చోపడే తెలుగులో కోతల రాయుడు అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఈ చిత్ర షూటింగ్ పనులు దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మొదలైనప్పటికీ పలు అనివార్య కారణాలు వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్నాడు.