టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణ దర్శకత్వం వహించిన అటువంటి “హిప్పీ” చిత్రంలో హీరో కార్తికేయ సరసన నటించి మెప్పించినటువంటి హీరోయిన్ దిగంగన సూర్యవంశీ గురించి తెలియని వారుండరు.అంతేకాక ఈ చిత్రంలోని సెకండాఫ్ లో వచ్చే డైలాగ్ అందరికీ ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే కార్తి కేయ సరసన ఇంటి ఇచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
అయితే తాజాగా సూర్య వంశీ “వలయం” అనే చిత్రంలో నటించింది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సూర్య వంశీ ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.అయితే ఇందులో తెలుగులో గతంలో తాను నటించిన టువంటి హిప్పీ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. కానీ తెలుగు ప్రజలు మాత్రం తనను బాగానే ఆదరించారని అంటుంది ఈ అమ్మడు.
అంతేగాక ప్రస్తుతం తాను నటించిన టువంటి వలయం చిత్రంలో పెద్దలు కుదిర్చిన టువంటి వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ ఉన్నటువంటి ఓ ఇల్లాలి పాత్రలో నటించానని చెప్పుకొచ్చింది.అయితే అంతా సరిగ్గా జరుగుతుంది అనుకున్న సమయంలో అనుకోకుండా జరిగినటువంటి ఓ సంఘటన తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందని మరియు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది సూర్యవంశీ.
అయితే సూర్య వంశి ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్నటువంటి ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.అయితే వచ్చి రావడంతోనే ప్లాప్ ని ఎదుర్కున్న అమ్మడు నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ అవకాశాలు దక్కించుకుంటుంది.