సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయం, నటనా ప్రతిభ, కష్ట పడే తత్వంతో పాటూ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని కొందరు సీనియర్ నటీనటులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఇందులో భాగంగా కొంతమంది నటీనటులకు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు తమ సినీ కెరీర్ లో రాణించలేక పోతున్నారు.
కాగా తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన “వేదం” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ఢిల్లీ బ్యూటీ “దీక్షాసేత్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తదితర సార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడు తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అవకాశాలు దర్శించుకోలేక పోయింది. దీనికి తోడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల దగ్గరకు వచ్చిన అవకాశాలను కాదనడంతో పలు హిట్ చిత్రాల్లో నటించే అవకాశాలని కోల్పోయింది.ఈ క్రమంలో ఈ అమ్మడికంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకోవడానికి ఒకానొక సమయంలో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించింది.
దాంతో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించలేక పోయింది.ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టున ఖాళీగా గడుపుతోంది.
కాగా తెలుగులో దీక్షాసేథ్ హీరోయిన్ గా నటించిన వేదం, వాంటెడ్, మిరపకాయ్, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
తెలుగులో దీక్షాసేథ్ చివరగా టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటించిన “ఊ… కొడతారా.? ఉలిక్కిపడతారా.?” అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. దీంతో ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినిమా నటించలేదు. కాగా ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ చక్కని ముఖ కవళికలు, అందం, అభినయం, నటనా ప్రతిభ, ఉన్నటువంటి దీక్షాసేత్ తాను నటించిన చిత్రాల్లోని పాత్రల ప్రాధాన్యత మరియు కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో హీరోయిన్ గా రాణించలేకపోయిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.