టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి, రెండు చిత్రాలలో నటించిన తర్వాత అనుకోకుండా డిజాస్టర్లను ఎదుర్కోవడంతో అవకాశాలను కోల్పోయి ఇతర సినిమా పరిశ్రమలకు వలస వెళ్ళిన నటీనటులు చలన చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.అంతేకాక తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోలేక కన్నడ, తమిళ, హిందీ తదితర చిత్ర పరిశ్రమలో సెటిల్ అయిన హీరో హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు.
కాగా ఇందులో తెలుగులో 2008వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు “అనీష్ కురువిల్లా” దర్శకత్వం వహించిన “ఆవకాయ బిర్యానీ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన తెలుగు బ్యూటీ బిందు మాధవి కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే నటి బిందు మాధవి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.
తన చదువు పూర్తయిన తర్వాత సినిమాలపై ఉన్నటువంటి మక్కువతో కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో పనిచేసి నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలో వచ్చి రావడంతోనే ఆవకాయ బిర్యానీ చిత్రంతో పర్వాలేదనిపించడంతో “పిల్ల జమిందార్, రామ రామ కృష్ణ కృష్ణ, బంపర్ ఆఫర్” తదితర చిత్రాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది.
కానీ చిత్రాల్లో ఈ అమ్మడి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం మరియు రెండో హీరోయిన్ కావడంతో హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.
ఈ క్రమంలో టాలీవుడ్ లో సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో బిందు మాధవి పూర్తిగా విఫలమైంది.దీంతో 2012 వ సంవత్సరం నుంచి ఈ అమ్మడు కోలీవుడ్ కి మతం మార్చి వరుస సినిమాల్లో నటిస్తోంది.
అయితే నటి బిందు మాధవికి టాలీవుడ్ పెద్దగా కలసి రాకపోయినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి తమిళంలో దాదాపుగా నాలుగు చిత్రాల ఆఫర్లు చేతిలో ఉన్నాయి.ఇందులో ఇప్పటికే “యారుకుం ఏంజెల్” అనే చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా మరో మూడు చిత్రాలు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.కాగా నటి బిందు మాధవి తెలుగులో కూడా ఈ సినిమా ఆఫర్ల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహించే ఫోటో షూట్స్ లో పాల్గొనే అందాలు ఆరబోస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.దీంతో ఈ అమ్మడికి సరైన హిట్ పడితే మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా పుంజుకుంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.