తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన “ప్రస్థానం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటుడిగా పరిచయమైన హీరో “సందీప్ కిషన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సందీప్ కిషన్ మొదటగా రెండో హీరో మరియు గెస్ట్ అప్పియరెన్స్ తదితర పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం బాగానే రాణిస్తున్నాడు.
కాగా తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ పాల్గొని తాను సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఎదుర్కొన్న పలు సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో ముఖ్యంగా తాను సినిమా అవకాశాల కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చానని తెలిపాడు.
అయితే మొదట్లో ఓ ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చిందని దాంతో కొంతకాలం పాటు సినిమా ఆఫీస్ లోనే నివాసం ఉన్నానని కానీ ఏమైందో ఏమో 25 రోజుల తర్వాత ఆ చిత్ర ప్రొడ్యూసర్ తన దగ్గరికి వచ్చి ప్రస్తుతం కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కాబట్టి కొంత కాలం పాటు బ్రేక్ తీసుకోమని చెప్పాడట.దీంతో తాను చాలా బాధపడ్డానని, కానీ ఆ తర్వాత తన స్థానంలో వేరే హీరోని తీసుకొని నెల రోజుల్లో సినిమా పూర్తిచేసి విడుదల చేశారని తెలిపాడు.
ఇక దాంతో సొంతంగా సినిమా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టానని ఈ క్రమంలో ఓ దర్శకుడు ఏకంగా తనకి లక్ష రూపాయలు ఇస్తే హీరో అవకాశం ఇస్తానని కూడా చెప్పాడట. దీంతో ఎలాగైనా లక్ష రూపాయలు ఇచ్చి హీరోగా నటించే అవకాశం దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చాడు.
కానీ కానీ తనని హీరో ని చేసేందుకు డబ్బులు అడిగిన దర్శకుడి పేరు మాత్రం సందీప్ కిషన్ బయట పెట్టలేదు.
అయితే ఇలాంటి సంఘటనలు తన జీవితంలో చాలా జరిగాయని మొదటగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అష్టా చమ్మా చిత్రంలో శ్రీనివాస్ అవసరాల నటించిన పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్లానని, కానీ తనికి ఆ పాత్ర సూటవ్వదుని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెలిపాడట.అలాగే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ చిత్రంలో నిఖిల్ నటించిన పాత్ర కోసం కూడా ఆడిషన్స్ కి వెళ్లానని కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ కూడా తనకి చుక్కెదురైందని చెప్పుకొచ్చాడు.అయితే తన మేనమామ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సపోర్ట్ చేసినప్పటికీ, తను మాత్రం ఎప్పుడు సినిమా అవకాశాల కోసం సొంతంగా ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగులో ఏ-వన్ ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో సందీప్ కిషన్ కి జంటగా అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.కాగా ఈ చిత్రంలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం ఈ నెల 5వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.