తెలుగులో “ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా, ఫిదా, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్,” తదితర బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “శేఖర్ కమ్ముల” గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల ఎప్పుడు వైవిధ్యభరితమైన కథనాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడంలో మంచి దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో హోస్ట్ గా వ్యవహరిస్తున్న “ఆలీతో సరదాగా” అనే ఈ కార్యక్రమానికి విచ్చేశాడు.దీంతో ఆలీ దర్శకుడు శేఖర్ కమ్ములతో పలు ఆసక్తికర విషయాల గురించి చర్చిస్తూ సందడి చేశాడు.
కాగా ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని షో నిర్వాహకులు యూట్యూబ్లో విడుదల చేశారు.
అయితే ఈ షోలో భాగంగా తను గతంలో దర్శకత్వం వహించిన “ఫిదా” కథని అప్పట్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరియు రామ్ చరణ్ లకు కూడా వినిపించానని, కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ ఇద్దరు హీరోలు ఫిదా చిత్రాన్ని రెజెక్ట్ చేశారని తెలిపాడు.ఆ తర్వాత “టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్” ని తీసుకున్నామని దాంతో ఈ చిత్రం మంచి సెన్సేషనల్ హిట్ అయిందని తెలిపాడు.
అప్పట్లో తాను దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ చిత్రం హిట్టవుతుందని తనకు చాలా కాన్ఫిడెంట్ ఉండేదని అంతేగాక ఆ కథ పట్ల తనకు మంచి జడ్జిమెంట్ కూడా ఉండేదని తెలిపాడు.
చివరికి తను అనుకున్న విధంగానే హ్యాపీ డేస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా మంచి విజయం సాధించిందని కూడా తెలిపాడు.కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విషయంలో కొంతమేర కాన్ఫిడెన్స్ తగ్గిందని అందువల్లే ఈ చిత్ర ఫలితం తారుమారైందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
అంతేకాకుండా తాను చాలా డెప్త్ గా కథలు రాస్తానని అందువల్లనే స్టార్ హీరోలకు నప్పవని ఆ కారణంగానే ఇప్పటివరకు తాను స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించలేదని కూడా తెలిపాడు.ఇక చివర్లో సారంగదరియా పాట గురించి స్పందిస్తూ రచయిత “సుద్దాల అశోక్ తేజ” ఎంతో వినసొంపుగా లిరిక్స్ రాసాడని కానీ తనవల్ల అనుకోకుండా ఎన్నో మాటలు పడ్డాడని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.ఈ విషయానికి సంబంధించిన మరిన్ని అంశాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు “శేఖర్ కమ్ముల” తెలుగులో “లవ్ స్టోరీ” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నాగచైతన్య, సాయి పల్లవి లు నటించారు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.