ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా....?

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించినటువంటి “అంతఃపురం” అనే చిత్రం సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ చిత్రంలోని “అసలేం గుర్తుకు రాదు” అనే పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ లిస్టు లో ఉంటుంది.

 Telugu Former Actress Soundarya And Prakash Raj Photos Viral In Social Media, S-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు, సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, శారద, బాబు మోహన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించింది.

కాగా ఈ చిత్రం విడుదలై ఇటీవలే 22 సంవత్సరాలు  కావస్తుండడంతో చిత్ర షూటింగ్ సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేశారు.ఇందులో ప్రకాష్ రాజ్ మరియు ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య నటిస్తున్న సమయంలో తీసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేగాక ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు ఉన్నప్పటికీ నటి సౌందర్య స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయకపోయారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో రంగ మార్తాండ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube