తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించినటువంటి “అంతఃపురం” అనే చిత్రం సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ చిత్రంలోని “అసలేం గుర్తుకు రాదు” అనే పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ లిస్టు లో ఉంటుంది.
కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు, సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, శారద, బాబు మోహన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించింది.
కాగా ఈ చిత్రం విడుదలై ఇటీవలే 22 సంవత్సరాలు కావస్తుండడంతో చిత్ర షూటింగ్ సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేశారు.ఇందులో ప్రకాష్ రాజ్ మరియు ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య నటిస్తున్న సమయంలో తీసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేగాక ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు ఉన్నప్పటికీ నటి సౌందర్య స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయకపోయారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో రంగ మార్తాండ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.